ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట
కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి:
నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మరియు బాధ్యత అనీ అలాగే మన ఓటు ద్వారా మన భవిష్యత్తును మనం రూపొందించుకోవచ్చు. కాబట్టి, అందరూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.