తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి

(ఏ డి జె ఎఫ్) జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు

మంచిర్యాల నేటిదాత్రి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గుర్తించాలని (ఏ డి జె ఎఫ్) జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా ఎంతో కృషి చేసింది జర్నలిస్టులు మాత్రమేనని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు,విద్యార్థులు, రచయితలు ఇలా సబ్బండ వర్గాల వారు చేసిన ఉద్యమాలను చూసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం వెనుక జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాలలో పాల్గొని రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన సంగతి ప్రస్తుత ప్రభుత్వాలు మర్చిపోవద్దని తీగల శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏండ్లు అయినప్పటికి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల బతుకులు మాత్రం ఏమీ మారలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నరిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యచరణ లో భాగంగా ఇందుకోసం జర్నలిస్టులు అందరూ కూడా సంఘాలకు అతీతంగా సమాయత్తం కావాలని (ఎ డి జె ఎఫ్ )జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!