జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు . ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.