అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం
◆ లంచం ఇస్తేనే కబ్జ ఇస్తాం వృద్ధ రైతులకు రెవిన్యూ సిబ్బంది బెదిరింపులు…తహసీల్దార్, ఆర్ఐ నిర్వాకం….!
◆- మా సొంత భూమికే,లక్షలు డిమాండ్ చేస్తున్న తహసీల్దార్, ఆర్ఐ
◆- అన్ని రికార్డులున్న మాకు అన్యాయం చేస్తున్న అధికారులు
◆- బోరున విలపిస్తున్న వృద్ధ మహిళ రైతులు
కోర్టు ఉత్తర్వులు ఉన్నపటికీ,జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికి ని పట్టించుకోని అధికారులు
-ఎంతటి అధికారులైన భయపడేది లేదు అంటు బెదిరింపులు
◆- ఏమి తోచక మంచాన పడ్డ వృద్ధ మహిళ రైతులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/ఝరాసంగం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగించి ప్రజలకు సమస్యలు లేని పాలన అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తే అవేమి పట్టకుండా రెవిన్యూ సిబ్బంది వారి ఇష్టనుసారంగా వ్యవహారిస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించి భూభారతి వెబ్సైట్ ప్రవేశపెట్టిన రెవిన్యూ సిబ్బంది ఆగాడాలు కొనసాగుతూనే ఉన్నాయని పేద రైతు కుటుంబాలు తమ బాధను వెళ్ళగక్కుతూనే ఉన్నారు. పూర్తి వివరల్లోకి వెలితే జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామనికి చెందిన కోస్గి మాణమ్మ భర్త రాములు కోస్గి సరోజ భర్త రాములు, గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 100/12లో రాములుకు 1978 లో 4 ఎకరాలు భూమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.అనంతరం మాన్యమ్మ,సరోజ, భర్త చనిపోగా వారి ఇద్దరికీ 100/12 2 ఎకరాలు 100/12/1 2 ఎకరాలు పంపకం చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మేము ఆ భూమిని సాగుచేస్తూ ఉన్నాము కాని మాకు డిజిటల్ భూమి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాని ఆ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మండల తహసీల్దార్, ఆర్ఐ ఇద్దరు లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నారు. కాని మాకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదని అధికారులకు చెప్పడంతో వారు మా పైన అగ్రహించి డబ్బులు ఇవ్వకుంటే మీకు పొజిషన్ లేదని రికార్డులు చేసి మీకు భూమి లేకుండ చేస్తామని మాకు బెదిరిస్తున్నారని వృద్ధ మహిళ లబ్ధిదారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో స్థానిక తహసీల్దార్, ఆర్ఐ మాకు అన్యాయం చేస్తున్నారని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 1978సంవత్సరం నుండి అన్ని రికార్డులు ఉన్న మాకు కబ్జా కాస్తు ఉన్న లంచం గురించి తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, ఆర్ఐ లంచం డిమాండ్ చేయడంతో జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించి తమ గోడు చెప్పుకుంటామని ఇటీవలే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామని నిరుపేదలైన మాకు జిల్లా కలెక్టర్ చోరువ చూపి మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

అవినీతికి అడ్డాగా మారిందని సమస్యలతో వచ్చి అ సమస్యల్ని పరిష్కారం చేయాలని స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వస్తే అధికారులు మాత్రం రైతులను నాన ఇబ్బందులకు గురిచేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తమ జేబులు తాసిల్దార్ గా ఉన్న తిరుమల రావు అన్ని తానై డబ్బులు ఇస్తే అవినీతి పనైనా చేసి పెడతారని బాధితులు అంటున్నారు. మండలంలో భూ తగాదాలతో వ్యవసాయ భూములను పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్యను పరిష్కరించాలంటే అధికారులకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పి బాధితుల దగ్గర లక్షల్లో వసూలు చేస్తున్నారు పసుపు తాసిల్దార్ కు తోడుగా ఆర్ఐ రామారావు మండల పరిధిలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ పనులను డబ్బులు వసూలు చేసి జిల్లా నుంచి పర్యవేక్షణకు అధికారులు వచ్చినప్పుడు అక్రమంగా మైనింగ్ చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చి తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ ఏం జరగనట్టుగా చేపిస్తున్నాడు డబ్బులు తీసుకుని ఒక కుటుంబానికి ప్రభుత్వము పంపిణీ చేస్తున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఒక కుటుంబానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని నిబంధనను ఉల్లంగించి వ్యవసాయ పోలానికి సర్వే చేసే క్రమంలో చల్లన్ కట్టకుండాప్పటికిని అనుమతి పోయినప్పటికీని సర్వే చేయించి అమాయకులైనటువంటి వ్యవసాయ రైతులతో పంచానామాలో సంతకాలు చేసుకొని అడ్డగోలుగా భూమికి అద్దులు చూయించి లక్షల్లో అవినీతి డబ్బు తీసుకొని రైతులకు మాత్రం ఝరాసంగం తాసిల్దార్ మాత్రం ముందు ముందు వరుసలో ఉంటారు. కుప్పానగర్ గ్రామంలో 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కేటాయించడం జరిగింది.


తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు లేదంటే ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని భూ రికార్డుల మార్పిడి,ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలని సూచనలు చేస్తూ లోపల మాత్రం ఇలాంటి అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.