పర్లపల్లి గ్రామ పాలకవర్గాన్ని సన్మానించిన జడ్పిటిసి జోరుకసదయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం
పర్లపల్లి గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పదవి కాలం ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ జోరుక ప్రేమలత మరియు ఉప సర్పంచ్ కట్ట విజయేందర్ రెడ్డి, వార్డు సభ్యులను గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన జడ్పిటిసి జోరుక సదయ్య
అనంతరం ఆయన
మాట్లాడుతూ
పదవి అనేది నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండే ఏ నాయకుడైన ప్రజల ఆశీర్వదించి పట్టం కడతారని , పర్లపల్లి గ్రామ ప్రజలు ఐదు సంవత్సరాలు మీకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు, అలాగే పర్లపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో అనేక కార్యక్రమాలు చేసిన గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని అభినందనీయమని ఆయన అన్నారు, ప్రజా సేవ చేసే నాయకులు ఎప్పుడూ ప్రజల మన్నలు పొందుతారని అన్నారు,
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోరుక ప్రేమలత, ఉప సర్పంచ్ కట్ట విజేందర్రెడ్డి, గ్రామ కార్యదర్శి నాగార్జున, బండి కుమార్ స్వామి, పుల్యాల సాంబయ్య, మహమ్మద్ తాజుద్దీన్, మరియు వార్డు మెంబర్లు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *