జమ్మికుంట టౌన్ నేటి రాత్రి జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

* ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చంద్రగిరి శ్రీనివాసును కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు *

ఈరోజు హైదరాబాద్ mla క్వార్టర్స్ లో mlc శ్రీ బల్మూర్ వెంకట్ గారి సమక్షంలో జమ్మికుంట మునిసిపాలిటీ మాజీ కౌన్సిలర్ ,brs సినియర్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ ,(30 వ వార్డ్ ) గారు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.బల్మూర్ వెంకట్ గారు చంద్రగిరి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. గతం లో నేను కాంగ్రెస్ పార్టీ వార్డ్ సభ్యునిగా పని చేసిన సమయంలో జమ్మికుంట పట్టణ లో పలు అభివృద్ధి కార్యక్రమలు చేసినాను. 2006 లో జమ్మికుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను. కొన్ని అనివార్య కారణాల వలన brs పార్టీ లో చేరడం జరిగింది .ఇప్పుడు నా స్వంత గూటికి కాంగ్రెస్ పార్టీ లోకి శ్రీ mlc బల్మూర్ వెంకట్ గారి సమక్షంలో చేరడం చాలా సంతోషంగా వుంది. వెంకట్ గారి నాయకత్వం లో జమ్మికుంట పట్టణం లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా తెలపడము జరిగింది కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, తంగెళ్ళ రాజు, చిక్కుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!