సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన అకాల వర్షాల కారణంగా ప్రాణ నష్టం ఆర్థిక నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఖమ్మం,వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ఇతర జిల్లాల్లో చెరువులకు గoడ్లు పడి పంట నష్టం జరిగిందన్నారు. వందలాది ఇల్లు మునిగిపోయాయి.మహబూబాబాద్ రైల్వే ట్రాక్ దెబ్బతిని రైళ్ల రాకపోకలు బంద్ కావడం జరిగిందన్నారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాలలో మొత్తం పంటలు,ప్రాణ నష్టం జరిగినకూడా కేంద్రం ప్రభుత్వం ఇంతవరకు ఏలాంటి ఆర్థిక సహకారం చేయలేదన్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాల (తుఫాను) కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వెసి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి పదివేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్,క్యతరాజ్ సతీష్,నెరెల్ల జోసెఫ్, జోగేశ్,పీక రవి,కాంతారావు,తిరుపతి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.