దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.
అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.
అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.
అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.
పలుగుల 8, 9, మరో మూడు ఇసుక రీచుల్లో రోజుకు వందకు పై లారీల ఇసుక రవాణా.
టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
దోపిడీ లక్ష్యంగా అక్రమ వసూళ్లు, అదునపు ఇసుకను లోడ్ చేస్తూ దర్జాగా దర్జాగా లక్షల రూపాయలు దూచుకుంటున్న ఇసుక క్వారీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా, దోపిడీకి మరింత సహకరిస్తూ దోపిడి ముఠాలకు దొరలుగా మార్చింది టీజీఎండిసి, దీనికి సాక్షాలు ఒకటి కాదు వందల సంఖ్యలో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది కానీ టీజీఎండిసి ఇలాంటి చర్యలు తీసుకోదు.

ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల కుదురుపల్లి కాలేశ్వరం పరిధిలో పలువుల 8 పలుగుల 9, ఉసుక్ పల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశం లాగా, దర్జాగా దూచుకోవడం జరుగుతుంది. ఇక పుసుకుపల్లి ఒకటి ప్రస్తుతం ఈ క్వారీ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా చేసి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకుంది, ఇక్కడ సిబ్బంది దర్జాగా అదనపు ఇసుక రవాణా చేయడం నిబంధనకు విరుద్ధం కాదని చెప్పడం జరిగినప్పటికీ టీజీఎండిసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నదంతా సమాప్తం చేసుకొని వెళ్లిపోయింది.

ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు ఇసుక క్వారీల అక్రమాలు మాత్రం ఆగడం లేదు, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు చేపడుతున్న కొద్ది ఈ క్వారీలకు లారీల సంఖ్య రోజుకు 100కు పైచిలువు లారీడు ఇసుక రవాణాకు రావడం ఆశ్చర్యం.
అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.
ఇక ప్రస్తుతం మహదేవ్పూర్ మండల పరిధిలో దర్జాగా టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుమస్తాల కంటే ఎక్కువగా, వసూళ్ల పర్వం చేపట్టడం, సీరియల్ లోడింగ్ కాంటా, వే బిల్, వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేయడం శరమాములుగానే కొనసాగుతుంది.

సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వం వెనుక ఒక బలమైన రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఇక ఇసుక రిచుల్లో సిబ్బంది అక్రమాలపై టీజీఎండిసీ నిశ్శబ్దం, పెద్ద మొత్తంలో ప్రతి క్వారీలో సుమారు రోజుకు లక్ష 30 వేల నుండి 2 లక్షల పదివేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేపడుతున్న టీజీఎండిసి నిశ్శబ్దం వెనుక ఒక బలమైన కారణం ఉందని అందుకే అధికారులు అక్రమ వసూళ్లపై పట్టించుకోవడంలేదని, ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి, అంతేకాకుండా మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు, స్వయంగా టీజీఎండిసి సిబ్బంది కలెక్షన్ చేయడం, వెనుక దాగి ఉన్న ఒక రహస్యం అది రహస్యం కాదు జగమెరిగిన సత్యం అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు చర్యలకు ససేమిరా అనడానికి ప్రధాన కారణం అని చెప్పడంలో సందేహం లేదు.
అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.
టీజీఎండిసి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందని, నిఘానేత్రం, రెవెన్యూ ,పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలను ఏర్పాటుచేసి అక్రమ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, చెప్పడం జరిగింది. కానీ అది కేవలం చెప్పుడు మాటల కొరకే, అదనపు బకెట్ తో ఇసుక క్వారీలు చిన్న బకెట్ కు 1500, పెద్ద బకెట్ కు 2000 నుండి 2500 వసూలు చేసేవారు, కానీ అప్పట్లో ఇసుక దోపిడీ జరుగుతుందని బహిర్గతం కావడంతో, కాంట్రాక్టర్లకు కాస్త ఇబ్బంది కలిగింది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా టీజీఎండిసి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి దానికి అమలు చేస్తుంది, అదేమిటంటే అక్రమ వసూళ్లు చేస్తే సరిపోతుంది అదునపు బకెట్ కు ఎంత అయితే కాంట్రాక్టర్లకు వస్తుండేది దానికి సరి సమానం అదునపు చార్జీలు, సీరియల్ కాంట లోడింగ్, కలిపితే 1600 నుండి 2200 వరకు వస్తుందని చెప్పి మరి తన సిబ్బందిచే కాంట్రాక్టర్లకు కలెక్షన్ చేసి అప్పజెప్పేలా చేసింది. దీనికి వందల సాక్ష్యాలు గత 20 రోజుల నుండి తెరపైకి తీసుకురావడం జరిగింది.
అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.
టీజీఎండిసి అక్రమ వసూళ్లపై వ్యవహారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి, గడిచిన 20 రోజుల నుండి అనేక సాక్షాలు తెరపైకి తీసుకు వచ్చినప్పటికీ, మహాదేవపూర్ కాళేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోకుండా ఉండడం ఒకవైపు అయితే, మరోవైపు పలువుల 8, 9, పుసుపల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ఈ ఇసుక క్వారీలో ఒక్క రోజు కూడా ఇసుక రవాణా కొరకు లారీలు తగ్గుముఖం పట్టిన దాఖలా లేదు, గడిచిన 22 రోజుల్లో పలుగుల 8 ,9, 100 నుండి 150 లారీల వరకు ప్రతిరోజు ఈ రెండు క్వారీల్లో పెద్ద మొత్తంగా ఇసుక అరవణ చేయడం జరిగింది. మరోవైపు మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, పుసుపల్లి పలువుల 6, పుసుపల్లి ఒకటి, 70 నుండి 110 లారీల వరకు ఈ మూడు ఇసుక క్వారీలు ప్రతిరోజు లారీల్లో ఇసుక రవాణా చేయడం జరిగింది. పూసుకుపల్లి ఒకటి, క్వారీలో తమ క్వాంటిటీ పూర్తికాకముందు ఒకటవ తేదీ నుండి 21వ తేదీ వరకు యావరేజ్ రోజుకు డెబ్బై నుండి మొదలుకొని 110 లారీల్లో ఇసుక రవాణా చేసింది. అక్రమ వసూలు చేస్తూ పాసింగ్ పై అదనపు ఇసుక దర్జాగా తరలిస్తున్నప్పటికీ టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఈ క్వారీల్లో పాసింగ్ పై అదనపు ఇసుక వస్తుందని, లారీ యజమానులు ఈ క్వారీలో మరింత రెట్టింపు ఉత్సాహంతో తమ లారీలను బుక్ చేయడం జరుగుతుంది.
టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.
ప్రస్తుతం మండలంలోని కాలేశ్వరం మహాదేపూర్ పరిధిలో నిర్వహించబడుతున్న నాలుగు ఇసుక రీచ్ లో, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, అక్రమంగా రవాణా చేస్తూ, లక్షల రూపాయలను దూచుకుంటున్న క్వారీలపై టి జి ఎం డి సి, చర్యలు తీసుకోకపోవడం. కాంట్రాక్టర్లకు అధికారులు తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న బలమైన నమ్మకం, మరోవైపు టి జి ఎం డి సి సిబ్బంది అధికారులు తమకు ఏమీ చెప్పరు, ఎందుకంటే మా రూటు కాస్త సపరేటు, అన్న విషయం వారికి తెలియడంతో, వారి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న క్రమంలో, ఈ నాలుగు ఇసుక రీచ్ లో అక్రమ వసూలు మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి, అమాయక లారీ డ్రైవర్ల నుండి లోడింగ్ ,పాసింగ్, కాంట, వే బిల్, మరోవైపు పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 తమకు అడిగే నాధుడే లేడని, మరింత రెట్టింపు ఉత్సాహంతో దర్జాగా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా టీజీఎండిసి, ఈ ఐదు క్వారీలపై చర్యలు తీసుకొని, క్వారీల కమిషన్ నిలిపివేసి, ఈ క్వారీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగిస్తారా, లేక అక్రమాలకు ప్రోత్సహిస్తారా అనేది వేచి చూడాలి.