అభివృద్ధి పనులకై వినతి పత్రం అందజేత

ఐదవ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాది గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, అభివృద్ధి పనులు సత్వరమే జరిపించేందుకు చొరవ తీసుకోవాలని సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఐదవ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జిలకర మహేష్ మాట్లాడుతూ… డిఎంఎఫ్టి నిధులనుండి 59 లక్షల రూపాయలు 2023వ సంవత్సరంలో సిసి రోడ్ల, డ్రైనేజీల నిర్మాణాలకు మంజూరయ్యాయని, ఆర్ అండ్ బి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించిన పనులు జరిపించడం లేదని అందువలననే సోమవారం మంచిర్యాల కలెక్టర్ కు పనులు జరిపించేలా చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందించడం జరిగిందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *