Illegal Red Stone Mining in Nyalakal
అక్రమ తవ్వకాలు ఆపేవారే లేరా!
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్లో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారని గతంలో పలువురు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే తవ్వకాలు ఆపించి వారిపై కేసు నమోదు చేయమని నాల్కల్ తహశీల్దార్కు.. ఆర్డీవో ఫోన్ చేసి ఆదేశించినా.. ఎమ్మార్వో చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
