మందమతులు..మతిలేని కుసంస్కారులు!

`మన మహిళలను గౌరవించలేని దౌర్భాగ్యులు!

`అందరికీ ఇంగ్లీషు రావాలని రూల్‌ వుందా?

`మంత్రి కొండా సురేఖ కు ఇంగ్లీషు రాకపోతే తప్పా!

`తెలంగాణలో తెలుగు తెలిస్తే చాలు!

`తెలుగులో మాట్లాడడం వస్తే చాలు.

`గతంలో బొడిగె శోభ విషయంలో కేసిఆర్‌ బుద్ధి హీనులను చెడుగుడు ఆడుకోలేదా? 

`మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డిని గౌరవం కేసిఆర్‌ కాపాడలేదా!

`మంత్రి కొండా సురేఖ పై ట్రోల్‌ ను కాంగ్రెస్‌ నాయకులు ఖండిరచరా!

`ఆమెకు అండగా నిలవరా?

`మీడియాలో సోకాల్డ్‌ సీనియర్లలో ఎంత మందికి ఇంగ్లీషు వచ్చు!

`అక్షర దోషాలు లేకుండా తెలుగు కూడా రాయలేని వాళ్లే ఎక్కువ!

`పెద్ద మీడియా వీడియోలకు ధంభ్‌ నెయిల్స్‌లో అన్నీ తప్పులే!

`అక్షరం ముక్క రాని వాళ్లు కూడా మీడియా పెద్దలు కావడం లేదా!

`మీడియాలో మిడిమిడి జ్ఞానం వున్న వాళ్లు మంత్రి సురేఖను విమర్శిస్తారా!

`మీడియాలో వున్నంత మాత్రాన అందరూ మేధావులు కాదు.

`ప్రజా సేవ చేసే వారికి ఇంగ్లీషుతో పని లేదు.

`ప్రజా సమస్యలు తెలిస్తే చాలు.

`ప్రజలకు మేలైన, మెరుగైన సేవలందిస్తే చాలు.

`బిసి. మహిళా మంత్రి సురేఖ అంటే అంత చిన్న చూపా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 విమర్శకు వివాదానికి తేడా వుంటుంది. ప్రతి విషయాన్ని విమర్శించొచ్చు. కాని ప్రతి విషయాన్ని వివాదం చేయొద్దు. కాని సోషల్‌ మీడియా యుగంలో ఏది నిజమో! ఏది అబద్దమో!! తెలుసుకోకుండానే అన్ని విషయాల మీద వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎవరు ఏం మాట్లాడినా తప్పులు తీస్తున్నారు. తప్పులు దొర్లితే ఎవరైనా, ఏదైనా మాట్లాడొచ్చు. కాని రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేకుండానే సోషల్‌ మీడియా మూలంగా వివాదాలు ఉదృతమౌతున్నాయి. ఒక రకంగా నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాయకులు ఎంత చిత్తశుద్దితో మాట్లాడినా పెడర్దాలు తీసున్నారు. వివాదాలకు కేంద్రం చేస్తున్నారు. అదే ఇప్పుడు ఇబ్బందికరమైనపోయింది. ప్రజలు కూడా ఏది నిజం? ఏది అబద్దం అని తెలుసుకునే ఆలోచన చేయడం లేదు. అబద్దం అంత అందగా అల్లుతున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన ఓ వ్యాఖ్యలో పరమార్ధం పక్కన పడేశారు. ఆమె గొప్పదనం మరుగున పడేశారు. సమాజం కోసం ఆమె చెప్పిన మాటలను వక్రీకరించారు. గతంలో పనులు విషయంలో జరిగిన వాటిని ఆమె ఉటంకించారు. కాని ప్రజా ప్రభుత్వంలో అలాంటివి లేవని, నిజాయితీ వుందని ఆమె మాటల్లోని అంతరార్ధం. కాని ఆమె మాటలను పూర్తిగా వక్రీకరించారు. మంత్రులు తప్పులు చేస్తున్నారన్న భావన వచ్చేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది తప్పని వారికి కూడా తెలుసు. కాని ప్రజలు అబద్దాలను వెంటనే నమ్మేస్తారు. అది అబద్దమని తెలిసే లోపు కొంత డ్యామేజీ జరిగిపోతూనే వుంటుంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో పనిగట్టుకొని ఆమె రాజకీయ ప్రత్యర్ధులు, వ్యతిరేకులు ఇలాంటివి లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఆమె రాజకీయ జీవితాన్ని పలుచన చేయాలని చూస్తున్నారు. కాని ఆమె రాజకీయ అనుభవం ఎంతో ఉన్నతమైంది. గొప్పది కూడా…మా అనుకునే వారిని ఎంత గా కడుపులో పెట్టుకొని కొన్ని వేల మందిని చూసుకున్నారు. కొండా దంపలులు ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తునిచ్చారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. వారి జీవితంలో పోరాటమే తప్ప, ఆరాటం ఎక్కడా కనిపించదు. అలాంటి కొండా కుటుంబం మీద ఇటీవల పనిగట్టుకొని కొంత మంది సాగిస్తున్న అసత్య ప్రచారం వల్ల వారికి వచ్చే నష్టమేమీ లేదు. కాని ప్రజల్లో కొండా దంపతులను పలుచన చేసి శునకానందం పొందాలని చూస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీషు రాదంటూ రాద్దాంతం చేశారు. కాని దేశబాషలందు తెలుగు లెస్స అని చెప్పిన మంత్రి కొండా సురేఖ మాటలను బుద్దిమాంద్యం కలిగిన కొన్ని మీడియా సంస్ధలు హేళన చేశారు. తెలంగాణలో వున్న వారికి తెలుసు వస్తే చాలు. ఇంగ్లీషు రావాల్సిన అసవరం లేదు. కొండా సురేఖ అదికారి కాదు. ఆమె పాలకురాలు. ప్రజా ప్రతినిధి. ప్రజా సేవలో వున్న నాయకురాలు. అలాంటి మంత్రికి ఇంగ్లీష్‌ రాదంటూ కొన్ని మీడియా సంస్దలు పనిగట్టుకొని పనికి రాని ప్రచారం చేశాయి. కొండా సురేఖ ఉన్నత విద్యావంతురాలు. మన దేశంలో ఎంత ఉన్నత విద్యావంతులైనా సరే చాలా మందికి ఇంగ్లీష్‌ను స్పష్టంగా మాట్లాడడం ఇప్పటికీ రాదు. ఇంగ్లీష్‌ అనేది ఒక బాష. ఐఏఎస్‌లు చదువుకున్న వారు కూడా ఇంటర్వూలలో తమ ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాస్తారు. ఇంటర్యూలు కూడా పూర్తిచేస్తారు. తర్వాత ఇంగ్లీష్‌ భాషను నేర్చుకుంటారు. ఆ మాత్రం తెలియని అజ్ఞానులంతా మీడియాలో చేరుతున్నారు. మంత్రి కొండా సురేఖను ట్రోల్‌ చేస్తున్న మీడియా సంస్ధల అధినేతలు, అందులో పనిచేసే జర్నలిస్టులెవరికీ ఇంగ్లీష్‌ పరిజ్ఞానం వుండదు. ఎవరికీ సరైన ఇంగ్లీష్‌ రాదు. కేవలం మీడియా వుందన్న అహంతో పెద్ద మీడియా సంస్దలు కూడా తప్పుడు వార్తలు సృష్టించడం గొప్ప అనుకుంటున్నారు. ప్రపంచంలో ఇంగ్లీష్‌ ఒక్కటే అందరూ అనుకరించరు. అనుసరించరు. అనేక దేశాలు తమ మాతృబాషనే గుర్తిస్తారు. చైనా లాంటి దేశంలో ఇంగ్లీష్‌ను ఎవరూ వాడరు. వారి ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా చైనీస్‌లోనే వుంటుంది. స్పెయిన్‌లో స్పానిష్‌నే వాడతారు. మనం ఇంగ్లీష్‌ అనుకొని మోసపోతున్న అనేక పదాలు, లాటిన్‌ బాషకు సంబందించినవి. ప్రపచంంలోని ఏ దేశానికి ఆ దేశానికి సంబందించిన బాషలే అదికార బాషలు. మనదేశంలోనే సుమారు కొన్ని వందల బాషలున్నాయి. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తమిళ్‌ తప్ప మరో బాష వారు మాట్లాడరు. తమిళనాడుకు చెందిన ఎంపిలు పార్లమెంటులో కూడా తమిళ్‌లోనే ప్రశ్నిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా తమిళంలోనే వారు మాట్లాడతారు. జాతీయ అంతర్జాతీయ వేదికలమీద కూడా వారి మాతృబాషలోనే మాట్లాడతారు. ఈ మాత్రం పరిజ్ఞానం లేని కొన్ని మీడియా సంస్దలు మంత్రి కొండా సురేఖపై లేనిపోని వివాదాలు సృష్టించాలనుకోవడం వారి వెలం వెర్రి తనానికి పరాకాష్ట అని చప్పాలి. నిజం చెప్పాలంటే వార్తలు ప్రసారం చేసిన, చర్చలు ఏర్పాటు చేసిన మీడియా సంస్దలు మంత్రి కొండా సురేఖకు బే షరతుగా క్షమాపణ చెప్పాలి. గతంలో ఇదే మీడియా బిఆర్‌ఎస్‌ హాయాంలో ఎమ్మెల్యేలపై లేనిపోని చులకన వ్యాఖ్యలు చేసినప్పుడు కేసిఆర్‌ ఎంతో బలంగా వారికి మద్దతు పలికారు. ఎమ్మెల్యేలకు అండగా నిలిచారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియాను తెలంగాణలో బ్యాన్‌ చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిదులపై లేనిపోని వార్తలు రాసి, రాద్దాంతాలు సృష్టిస్తే బాగుండదని హెచ్చరించారు. రెండు ప్రధాన మీడియా సంస్దలను తెలంగాణలో ప్రసారాలు నిలిపివేశారు. ఆ సమయంలో బొడిగేశోభ శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కాస్త తడబడ్డారు. ఒకానొక సమయంలో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణలో నిత్యం వాడుకునే ఒక మాటను అనడాన్ని తప్పు పడితే కేసిఆర్‌ వివరణ ఇచ్చారు. తెలంగాణలో వ్యవహరిక బాషలోని పదాన్ని జగదీశ్వరరెడ్డి అనడం పెద్ద పొరపాటు కాదని సమర్ధించారు. కాని రెండు రోజులుగా మంత్రికొండా సురేఖపై మీడియాలో వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు. ఆమెకు ఎందుకు అండగా నిలవడం లేదు. మీడియాను ఎందుకు హెచ్చరించడం లేదు. తప్పుడు కథనాలు వేయొద్దని ఎందుకు సూచించడం లేదు. ఆమెకు సపోర్టు చేయడానికి కూడా కాంగ్రెస్‌ నాయకులకు మనసు రావడం లేదా? ఆ మధ్య మరో మహిళా మంత్రి సీతక్కకు కూడా ఇదే విధంగా నిండు అసెంబ్లీలో అవమానం జరిగింది. అప్పుడు కూడా ఏనాయకుడు స్పందించలేదు. ఒక్క నేటి దాత్రి మాత్రమే ఆ రోజు అందరికన్నా ముందుగా స్పందించింది. ఏంఐఎంకు చెందిన ఎమ్మెల్యే మంత్రి సీతక్కకు హిందీ రాదంటూ చేసిన వ్యాఖ్యలపై నేటిదాత్రి అక్షర సమరం సాగించింది. మంత్రి సీతక్కకు ఎంఐఎం. క్షమాపణ చెప్పేదాకా పోరాటం చేసింది. ఇప్పుడు మీడియాలోని ఓ వర్గం మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీష్‌ రాదంటూ లేనిపోని రాద్దాంతం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్‌ వచ్చింది? తెలంగాణకు చెందిన చెన్నారెడ్డికి తప్పకి ఏ ముఖ్యమంత్రికి పెద్దగా ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన టి. అంజయ్య ఎంతో గొప్ప ముఖ్యమంత్రిగా పేరు పొందారు. కార్మిక పక్ష పాతిగా కీర్తిని పొందారు. అలాంటిది మంత్రి కొండా సురేఖకు ఇంగ్లీష్‌ రాకపోవడం ఏదో నేరమైనట్లు, వెకలి వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలు మీడియా సమాజానికే తలవంపులుతెస్తాయి. ఇక మంత్రి కొండాసురేఖ అనని మాటలను కూడా తీసుకొచ్చి ప్రసారం చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఏం చేస్తున్నారు. మీడియాకు ఇంత విచ్చలవిడితనం మంచిది కాదు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో మంచిని వెతికే ఓపిక లేని వాళ్లు అబద్దాలు సృష్టించారు. పారిశ్రామిక వేత్తలను కూడా ప్రజా సేవ చేయమని మంత్రి చెప్పారు. ప్రజలకు ఉపయోపగపడే మంచి పనులు చేయాలని కోరారు. అప్పుడు తాము ఎంతో సంతోషిస్తామని గొప్ప మాట చెప్పారు. కాని ఆ మంచిని వదిలేసి, కమీషన్‌ గురించి వార్తలు రాసి మంత్రిని తక్కువ చేయాలనుకుంటే కుదరదు. మీడియాలో వచ్చే ప్రతి వార్తకు స్పందించాల్సి వస్తే రాజకీయాల్లో ఒక్క నాయకడు కూడా మిగలరు. ఏ ఒక్కరు రాజకీయాలు చేయలేరు. ప్రజా సేవకు ఎవరూ ముందుకు రాదు. మీడియా అంటే ప్రజాసేవ కాదు. ప్రజాసేవ చేసేవారికి ప్రజల కష్టాలు తెలియజేసే వారధిగా వుండాలి. ప్రజల మేలుకోసం పనిచేయాలి. అంతే తప్ప ప్రజా సేవ చేసేవారిపై లేనిపోని వార్తలు రాస్తూ పోతే, ప్రజలకు మీడియానే తీరని అన్యాయం చేసినట్లౌవుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!