ఎస్సారెస్పీ డిబిఎం 38 కాలువ ద్వారా సాగు నీరు అందించాలి.

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

చిట్యాల,నేటిధాత్రి :

ఎస్సారెస్సి డిబిఎం 38కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మండల కేంద్రంలో సోమవారం రోజున మాట్లాడుతూ రాష్టంలో సాగు నీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యిందని, భూగర్భజలాలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం యాసంగి పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉందని, రైతులు అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నారని, రైతులు ఆరుగాలం కష్ట పడి పని చేసి పంట చేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఇబ్బందుcలు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందించి ఈప్రాంత రైతుల సంక్షేమం కోసం ఎస్సారెస్పీ డిబిఎం 38 కెనాల్ ద్వారా రేగొండ, చిట్యాల, టేకుమట్ల లోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగి రాజు,జీడి రాజు, బండారి రాజయ్య తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!