శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము
జహీరాబాద్. నేటి ధాత్రి:
గ్రా రంజోల్ (బాబానగర్), మం॥ జహీరాబాద్, జిల్లా సంగారెడ్డి,తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 7-00 ని॥లకు సృష్టి, స్థితి, లయకారిణి తన కంటి చూపుతో జగత్తును నడిపించు తల్లి అపారశక్తి మాతా ఆ శక్తి దివ్య స్వరూపిణి, శ్రీ పెద్దమ్మతల్లి మాతా సుమారుగా 150 సం॥ల నుండి ఇక్కడి చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు పొడి, పంటలకు సంబందించి భక్తులందరిని అనుగ్రహిస్తూ, భక్తులందరికి కొంగు బంగారమై వెలసిన శ్రీ పెద్దమ్మతల్లి కోరిన కోరికలు వెంటనే తీర్చి సుఖ శాంతి సంతోషాలను ప్రసాదిస్తుందని ఇక్కడి స్థల ప్రతిష్ఠ ఆచల్లని తల్లి అయిన శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము వైభముగా జరుగును. కావున భక్తులందరూ కార్యక్రమములో తన, మన, ధన రూపేన పాల్గోని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.
వేదిక కార్యక్రమ వివరములు :
తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 6-00 గం॥లకు గోపూజ, అగ్రోదకము, ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధనము, మహా గణపతిపూజ, స్వస్తిశివపుణ్యహావచనము తరువాత విగ్రహ జలాధి వాసము తరువాత పంచాచార్య పూజ, పంచ గవ్వ ప్రాశనము, నాడి సమారాధనము, నవగ్రహ అష్టదిక్పాలక పూజా సర్వతో భద్ర మండప ప్రధాన కళశ దేవత ఆహ్వాన పూజ, అగ్ని ప్రతిష్ఠ మరియు తీర్ధ ప్రసాదములు మంగళవారము ఉ. 7-00 గం॥లకు విగ్రహము ఊరేగింపుతో విగ్రహం ఆలయం వద్దకు వచ్చుట మరియు హోమము విగ్రహ జలధివాసనము. సా॥ 6-00 గం॥ హోమము విగ్రహ దాన్యాధి వాసము.
తేది: 26-03-2025 బుధవారము రోజున ఉ॥ 5-00 గం॥లకు సుప్రభాత సేవా తరువాత విగ్రహ శయ్యాధి వాసనము తరువాత మండవ దేవతా ఆరాధనము కళశ పూజా. జపాది స్నానము (మహాస్నపనము) హోమము.
ఉ॥ 11-39 ని॥లకు విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టా, నేత్రనిర్మలనము, పూర్ణాహుతి అమ్మవారి ధర్శనము, సద్గురువుల ఆశీర్వాద ప్రవచనము. పండిత సన్నానము ఆశీర్వచనములు మరియు తీర్థ ప్రసాదములు, మ॥ 1-00 గం॥లకు గ్రామము నుండి గుండి వరకు భోనాల
కార్యాక్రమము తర్వాత.
తేది: 25-03-2025 రోజు మ॥ 2-00 గం॥ మరియు తేది: 26-03-2025 రోజు సా॥ 5-00 గం॥లకు భక్తులందరు అన్నదాన ప్రసాదము స్వీకరించుకోగలరు.
ఈ కార్యక్రమమునకు విచ్చేయు పూజ్యగురువరేణ్యులు:
వేధిక నిర్వాహణ:
శ్రీ గురు శాంతయ్య స్వామి,
శ్రీ రాజు స్వామి, శివప్రసాద్ స్వామి
శ్రీ వద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, పెద్దలు.