గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలో గల రామాలయం ఆలయంలో ఈనెల 17 వ తేదీ బుధవారం రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఈనెల 18 వ తేదీ గురువారం రోజున జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు రావాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త అనంతుల భూమయ్య, రామాలయ అర్చకులు తిరునాహరి సత్యనారాయణ చార్యులు, గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, గురిజాల బుచ్చిరెడ్డి, ముస్కు కొండల్ రెడ్డి, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, సాతల్ల ఎల్లయ్య, ఏడ గొట్టి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానము
