ఎడ్ల పరుగు పందెం పోటీలకు ఆహ్వానం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా ఎడ్ల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు.ఈ సంవత్సరం కూడా ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నామని చిన్న ఎడ్ల పరుగు పందెం తేదీ 11 ఆదివారం ఉదయం 10 గంటలకు గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య సమాచారం కొరకు పాగిడి తిరుపతి సెల్ 8008087488 నెంబర్ కి ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల ప్రజలు,అధికారులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని కిష్టాపూర్ గ్రామ ప్రజలు కోరుచున్నారు.
