గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కాటారం నేడు ధాత్రి

కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024 సంవత్సర క్యాలెండర్ ను కాటారం మండలం దామరకుంటలో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అరిగెల వెంకటరాజం గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘము రాష్ట్ర కార్యదర్శి మారగోని శంకర్ గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పున నెల రోజుల లోపు ఇవ్వాలన్నారు. మెడికల్ బోర్డు విధానం తొలగించలి వృత్తిలో ఎక్కడ ప్రమాదం జరిగినా వర్తింప చేయాలని అన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలన్నారు. గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 4000 ఇవ్వాలని అన్నారు. కల్లుగీత కార్మికులందరికీ వృత్తికి ఉపయోగపడే ద్విచక్ర వాహనాలను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పల్లె శ్రీను గౌడ్, ఆత్మకూరి స్వామి యాదవ్, మాజీ ఎంపీపీ మంథని రాజ నరసయ్య, రామగుండం శ్రీనివాస్, కనుకుట్ల సమ్మయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *