గాంధారి మైసమ్మ జాతర పోస్టర్లు ఆవిష్కరణ

మందమర్రి, నేటిధాత్రి:-

మండలంలోని బొక్కల గుట్ట గ్రామ పంచాయతీలోని బొక్కల గుట్ట గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర పోస్టర్లను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆదివాసుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరారు. గాంధారి ఖిల్లా ను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, ఉపాధ్యక్షులు మార్నేని భూమేష్, గుండం రాజేష్, సాంస్కృతిక కార్యదర్శి పిట్టల భూమేష్, జిల్లా నాయకులు సాదం బాపు, బద్ది చిన్నయ్య, గాంధారీ ఖిల్లా మైసమ్మ అలయ కమిటి వైస్ చైర్మన్ దైనేని రమేష్, సీనియర్ నాయకులు గంజి రాజన్న, లౌడం రాజ్ కుమార్, తట్ర అర్జున్, మూతి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *