ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

INTUC INTUC

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని వద్ద యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సిహెచ్.భీమ్రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగే స్వామి జెండాను ఆవిష్కరించి,కేకును కట్ చేశారు.అనంతరం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.1947 మే 3న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య బేబీ కృపాలాని ఐఎన్టీయూసీ ని స్థాపించారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు,సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిపెట్టిన ఘన చరిత్ర ఐఎన్టియుసి యూనియన్ ది అని కొనియాడారు.30 మిలియన్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక కార్మిక సంఘం అని అన్నారు. జాతీయస్థాయిలో ఇన్ని సభ్యత్వాలు కలిగి ఉండడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ లు కార్మికుల హక్కులను సాధించడమే ధ్యేయంగా నేటి వరకు కృషి చేయడమే అన్నారు.రానున్న రోజులలో యూనియన్ను మరింత బలమైన కార్మిక సంఘంగా నిర్మించడం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు పేరం రమేష్,ల్యాగల శ్రీనివాస్,ఫిట్ కార్యదర్శి నంబయ్య,జిల్లా కార్యదర్శి బీమ్ రవి, ఉపాధ్యక్షులు జే.నర్సింగ్,ఫిట్ అసిస్టెంట్ కార్యదర్శిలు మహేష్ రెడ్డి,శ్రీను,రవి, కార్యదర్శులు చందు పటేల్,బి.అశోక్,చిన్నయ్య, మహేందర్ రెడ్డి,రాజు,మల్లేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!