భారత ప్రధాని పిలుపుమేరకు.

“నేటిధాత్రి” జమ్మికుంట.

11వ “అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల” జరుగున్న కార్యక్రమాలలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల 27 నుండి వచ్చే నెల 21 వరకు (25 రోజుల పాటు) జమ్మికుంట మండలంలో “ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్” GAD పోతీరెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా” కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా ఆయుష్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో…

మెడికల్ ఆఫీసర్ లు డాక్టర్ సంధ్యారాణి,GAD పోతీరెడ్డిపల్లి, ప్రిన్సిపాల్ CH.లచ్చయ్య, స్కూల్ స్టాఫ్, PET లు సిబ్బంది, పాల్గొన్న కార్యక్రమంను విజయవంతం చేసారు..

 

యోగ శిక్షణ కార్యక్రమలో. మెడికల్ ఆఫీసర్ సంధ్యా రాణి మాట్లాడుతూ… యోగా తో నిత్యం వాడే మందుల వాడకం తగ్గుతుందని చెప్పారు… ప్రిన్సిపాల్ లచ్చయ్య మాట్లాడుతూ… యువత శరీర శౌష్ణవం, వృద్ధి చెంది, ఆరోగ్యావంతమైన శరీరం ఏర్పడుతుందని…చెప్పారు..మరియు యోగా నిర్వాహకులు, ప్రఖ్యాత శిక్షకులు శ్రీ దేవునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”భారతీయ జీవనశైలి లో అందరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగ నిత్య జీవితం లో భాగం చేసుకోవాలని ” పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!