ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

నర్సంపేట టౌన్,నేటిధాత్రి :

బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ మరియు బిట్స్ స్కూల్ బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏ.వనజ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ
విద్యార్థి ఆంగ్ల భాషలో పడి మాతృభాషను మరువకూడదని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు
తెలుగు భాషా ప్రాముఖ్యతను, మాతృ భాషలో గొప్పతనాన్ని విద్యార్థులు పాటలు పడి వినిపించారు.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రెటరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్,
సి.ఏవొ. సురేష్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *