
Flag Insult Sparks Anger
జాతీయ జెండాకు అవమానం
#నెక్కొండ, నేటి ధాత్రి:
దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.