కామారెడ్డి జిల్లా/ నిజాం సాగర్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామపంచాయతీ , మంగళూరు గ్రామపంచాయతీల పరిధిలో సెక్రటరీలు జ్యోతి, రమ్యశ్రీ, లు శుక్రవారం రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా వారు రేషన్ కార్డులో లబ్ధిదారులు, రేషన్ కార్డులో నమోదు కానీ వారి వివరాలు సేకరించారు. దీంతోపాటు ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా అందించన సంక్షేమఫలాలు తదితర వివరాలను నమోదు చేసుకుని ఉన్నత అధికారులకు వివరాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు పల్లి సెక్రటరీ జ్యోతి, మంగళూరు సెక్రటరీ రమ్యశ్రీ, కారోబార్ నందు, పంచాయతీ వర్కర్స్ సుబ్బురి బాగయ్య, గైని విట్టవ్వ, శ్యామయ్య, తదితరులు ఉన్నారు.