
30 వార్డు విభజనలో అన్యాయం
అఖిలపక్ష ఐక్యవేదిక.
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి 30 వ వార్డులో అఖిలపక్ష ఐక్యవేదిక తరుపున వార్డు ను పరిశీలించామని
మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తెలిపారు
వనపర్తి లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వ నిధులను ఉపయోగించకుండా కొందరి సలహా హాలు తీసుకుని రోడ్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సతీష్ ఎమ్మెల్యే ను అధికారులను కోరారు
వార్డు విభజనలో 30 వార్డును అన్యాయంగా 5 వార్డులను చీల్చి ఒక వార్డుగా చేశారని దానివల్ల వార్డు అభివృద్ధి కి నోచుకోవడం లేదని అన్నారు జంగిడి పురం మర్రిచెట్టు అనూస్ స్కూల్ రోడ్డు గుంతలు ఏర్పడి ఈ రోడ్డు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి.వరకు లింకు ఉన్నదని, సివి రామన్ కాలేజ్ కింది నుండి నాగవరం పోయే రోడ్డు మొత్తం దెబ్బతిన్నదని
స్విమ్మింగ్ పూల్ దగ్గర రెండు రోడ్లు ఇంతవరకు వేయలేద నివెంటనే సిసి రోడ్లు వేయాలని 30వ వార్డు ప్రజల తరఫున అధికారుల ను ఎమ్మెల్యే ను కోరారు 30 వార్డు ను పరిశీలించిన వారిలో వెంకటేశ్వర్లు తెలుగుదేశం కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్, రామస్వామి నాగరాజూ, రమేష్ ముదిరాజ్ గార్డుల శీను వార్డు ప్రజలు ఉన్నరని సతీష్ యాదవ్ తెలిపారు