
90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కు అన్యాయం
టి సి జె ఎ సి అడ్వైజర్ పాయిరాల శరత్ యాదవ్
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరిగింది, గత 90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కి అన్యాయం జరుగుతున్న సందర్భంగా జిల్లా క్రికెట్ కి న్యాయం చేయాలని గ్రామీణ క్రీడాకారులను గుర్తించి తగిన అవకాశాలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు 209 క్లబ్లు ఉండగా తెలంగాణ ఉమ్మడి 8 జిల్లా లకు కేవలం 8 క్లబ్బులు మాత్రమే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఖండిస్తూ తెలంగాణ జిల్లాలకు 300 క్రికెట్ క్లబ్బులు అఫిలియేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ స్టేడియం ని ముట్టడించడం జరిగింది, ఇప్పటికైనా స్పోర్ట్స్ మినిస్టర్ స్పందించి తెలంగాణ గ్రామీణ క్రీడకరులకు న్యాయం చేయాలని లేని పక్షాలు బీసీసీఐకి చెప్పి తెలంగాణ కి సపరేట్ అసోసియేషన్ కి సహకరించగలరని టి
సి జె ఎ సి అడ్వయిజర్
పాయిరాల శరత్ యాదవ్
మాజీ విజ్జి ట్రోఫీ ప్లేయర్
మాజీ హెచ్ సి ఏ ప్లేయర్
కాకతీయ యూనివర్సిటీ మాజీ కెప్టెన్ మాట్లాడారు ఇట్టి కార్యక్రమం లో తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి టి సి జె ఎ సి జిమ్మి బాబు తదితరులు పాల్గొన్నారు.