ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

Government Government

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుడాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈవో) మొండయ్యకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు వూర్తిస్థాయిలో అందివ్వాలని పాఠశాలలో సబ్జెక్టు వైస్ గా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు, ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, డిజిటల్ క్లాసులకు అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ మరియు ఎన్విరాల్న్మెంట్, ఎక్విప్మెంట్స్ పెంచుకునేందుకు ప్రతి పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా సరిపడ గ్రాండ్స్ విడుదల చేయాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలో కనీసం టాయిలెట్స్, పాఠశాల
కాంపౌండ్ వాల్, కరెంటు, వాటర్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా కాలిగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని, ఈఅంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ పవణ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!