ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం నేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి ఎండి రజియా స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ కృష్ణంరాజు తో కలిసి ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.బొజ్జ కృష్ణంరాజు మాట్లాడుతూ శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసడింగ్ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు ఐలయ్య,రంజిత్, సురేష్
తదితరులు పాల్గొన్నారు.