కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు.

Indiramma's House

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు

⏩ అర్హులకు అందని సంక్షేమ పథకాలు.
⏩ పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు.

సుంకరి మనిషా శివకుమార్. 16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి:

shine junior college
shine junior college

గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగాయి అని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో స్థానిక పరకాల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని,గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరు అయి ప్రొసీడింగ్స్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో ఇంటి నిర్మాణ పిల్లర్లు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయురాలు అయింది అని ఆవేతరం వ్యక్తం చేశారు. పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు అందిస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పాడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలసి పోరాడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల సంజీవ,గ్రామ పార్టీ నాయకులు బొజ్జం తిరుపతి,నరసింహ,SbK అంజాద్,బొంత.రవి,ఏడాకుల మోహన్ రెడ్డి,రాజారాం,కన్నేబోయిన.రాజు,మెండురామకృష్ణ,రాజేందర్,మురళి,యశోద,అశోక్,చిరు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!