
District Collector at the local MPDO office.
మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చేతుల మీదుగా జిల్లెల్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 26 మందికి పత్రాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. మండలంలో గృహ అవసరాల నిమిత్తం ఇసుక కొరత లేదని అలాగే గృహ నిర్మాణాల కొరకు తమకు సంబంధించి పంట పొలాల నుంచి ఊరి చెరువుల నుంచి గాని. సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల. ఎమ్మార్వో.ద్వారా గాని పర్మిషన్ తీసుకొని ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ప్రజలు మట్టి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే జిల్లెల్ల గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చెప్పిన మా పేరు ఉన్నది అని తీరా సమయానికి వచ్చేసరికి మా పేరు లేకపోవడంతో జిల్లెల్ల.గ్రామ క్రాసింగ్ లో చౌరస్తాలో.నడిరోడ్డుపై నివసిస్తున్న మా ఇల్లు 70 శాతానికి . పైగా రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో. ప్రభుత్వ అధికారులు తీసుకున్నారని దానికి అనుగుణంగా మీకు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయడం జరుగుతుందని మాట ఇచ్చి ఇప్పుడు మా పేరు లేదని చెప్పడం ఎంతవరకు న్యాయమని అటువంటి వారం చాలామంది ఉన్నామని మా పిల్లల ఆరోగ్యలు బాలేకున్న కొన్ని సంవత్సరాల నుండి కిరాయిల. ఇండ్లలోబతుకుతూ జీవనం గడుపుతున్నామని దయచేసి సరైన లబ్ధిదారులు గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేవిధంగా. మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా జిల్లెల్ల గ్రామస్తులు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా.రాళ్ల పేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్. తుది దశలో ఉన్నందున పిడి హౌసింగ్ ఎంపీడీవోను అభినందిస్తూ లబ్ధిదారులు పారదర్శకంగా ఎంపిక చేసి వారికి తగిన న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఎంపీడీవో. ఎమ్మార్వో. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ. మార్కెట్ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నర్సింగ్ పిడి ఎంపీడీవో లక్ష్మీనారాయణ.తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. పూర్మాని లింగారెడ్డి. మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు