చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ సప్లై కార్మికులు నిరవేదిక సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో (04.10.2024) జరిగిన ఒప్పందం ప్రకారం సివిల్ సప్లై హమాలి కార్మికుల రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచుటకు అంగీకరించి జి.ఓ. విడుదల చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రేట్ల సవరణ చేస్తూ ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ చిత్తశుద్ధితో హమాలీ కార్మికుల శ్రమను గుర్తించి హమాలీ రేట్లు పెంచటం జరుగుతుంది. గత ఒప్పందం ప్రకారం 01.01.2024 నుండి కొత్త రేట్ల ఒప్పందం జరగాల్సివున్నది. చర్చలు జరిపి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము.డిమాండ్స్:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు క్వింటాల్కు 26 నుండి రూ.35/-లకు పెంచాలి,350కిలోల బెల్స్ బండల్కు ఒక్కటికి ఎగుమతి, దిగుమతికి రూ.200/-లకు పెంచాలి. దసరా పండుగ సందర్భంగా ఇచ్చే స్వీటుకు రూ.800 నుండి రూ.1200లకు పెంచాలి.ఇయస్ ఐ సౌకర్యం కల్పించాలి..హమాలీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.బోనస్ రూ.6500 నుండి రూ.10,000/-లకు పెంచి చెల్లించాలి.రిటరైన హమాలీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలి.హమాలీ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి.యూనిఫాం కుట్టుకూలి రూ.1300 నుండి 2 వేలకు పెంచాలి.గోడౌన్లలో కార్మికుల అవసరాన్ని బట్టి కార్మికులను నియమించుకునే అధికారం కల్పించాలి.కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకాన్ని సంపూర్ణంగా రద్దు చేసి ఎటిఎం/ఎటిఆర్లను పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
ఈ సమావేశంలో సివిల్ సప్లయీస్ హమాలి కార్మికులు ఆరేపల్లి సమ్మయ్య, గుర్రపు నర్సయ్య, దాసరపు సాంబయ్య, శీలపాక నాగరాజు, మలుగూరి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.