ఇందారం గ్రామపంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన

జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీని ఆకస్మికంగా జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్ రావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి గ్రామంలో చెత్తా,చెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు కాలువల లో దోమలు పెరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ప్రతిరోజు డ్రై డే పాటించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్య సిబ్బందికి తెలిపారు. అనంతరం టేకుమట్ల గ్రామ పంచాయతీని సందర్శించి రైతు వేదిక వద్ద నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్ రావు, ఎంపీడీవో జి. సత్యనారాయణ గౌడ్, ఏఎన్ఎం. కృష్ణవేణి, ఇందారం పంచాయతీ కార్యదర్శి ఏ. సుమన్, టేకుమట్ల పంచాయతీ కార్యదర్శి ఆర్. శ్రావణి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *