పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి.

student bus pass student bus pass

పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి

జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలను 20% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ
ఇప్పటికే గతంలో పెంచిన బస్ ఛార్జీలు, స్టూడెంట్స్ పాస్ ఛార్జీలు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20% ఛార్జీలు పెంచి అమలు చేస్తే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్య కోసం బస్ నమ్ముకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోని చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చాలా రూట్లలో విద్యార్థులు కోసం బస్సులు నడపడం లేదు. ఒక ప్రక్క బస్సులు సంఖ్య పెంచి, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఛార్జీలు, బస్ పాసులు పెంచే ఆలోచన చేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే పాసుల ఛార్జీలు పెంపు ఆలోచనలు విరమించుకోవాలి. లేకుంటే అన్ని డిపోల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని అన్నారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయని వాటిని పర్యవేక్షణ చేయడంలో జిల్లా విద్యాధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని వెంటనే పర్మిషన్ లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని అన్నారు అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు ,పక్కా భవనాలు నిర్మించాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రినీ నియమించాలని డిమాండ్ చేశారు, లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ ,నాయకులు జస్వంత్, అఖిల్, అక్షయ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!