తెగ ముదిరిపోతున్న ర్యాంకుల పిచ్చి

విద్యార్థులపై విపరీత ఒత్తిడి

క్రీడలు, ఇతర కృత్యాలకు ప్రాధాన్యం శూన్యం

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌….ఈ రెండే కోర్సులా?

ఐదు దశాబ్దాల క్రితం విద్యాప్రమాణాలు ఇప్పుడేవీ?

విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం శూన్యం

మార్కులు, ర్యాంకులే విద్యార్థుల లక్ష్యాలు

ఆడుకునే వయసులో ఏసీ రూమ్‌లలో చదివించినా వృధా

భావి తరాన్ని నిర్వీర్యం చేస్తున్న ‘ర్యాంకుల’ విద్య

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో విద్యావ్యవస్థ పనితీరు ఆశించినంత గొప్పగా యేమీ లేదనే చెప్పాలి. గ్రామాలు, పట్టణాల్లో తల్లిదండ్రులు ఎంత కష్టాన్నైనా భరించి తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పించడానికే ఉత్సాహం చూపుతున్నారు తప్ప, ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గు చూపడంలేదు. ప్రాథమిక వి ద్య, పాఠశాల విద్య, కళాశాల విద్యకోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నా పిల్లల చదువు నిప్పచ్చరంగా కొనసాగడానికి ప్రధాన కారణం విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణమైనలోపాలు. క్వాలిఫికేషన్లున్నా చాలామంది టీచర్లకు వర్తమాన కాలానికి అనుగుణమైన నైపుణ్యాలు లేక పోవడం, కొన్ని స్కూళ్లలో విద్యార్థులే లేకపోవడం, సమయపాలన విషయంలో నిర్లక్ష్యం, అన్నింటికీ మించి మౌలిక సదుపాయాలు ఎక్కువ స్కూళ్లలో మృగ్యం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పాలి. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్లను పోల్చుకొని పనిచేసేవి. ఇప్పుడు పరిస్థితి తల్లక్రిందులై, ప్రభుత్వ స్కూళ్లే ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకోవాల్సిన దుస్థితి! ఫలితంగా ప్రవేశాలకోసం పోరాటం, ర్యాంకుల ఆరాటం పిచ్చి ముదిరి వెర్రి స్థాయికి చేరింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతే లేకుండా పోయింది. ఎంతసేపూ చదువు, ర్యాంకులు త ప్ప ఎవరూ దేన్నీ పట్టించుకోవడంలేదు! ఇది చిన్న పిల్లల మెదళ్లపై అపరిమితమైన ఒత్తిడికి కారణమవుతోంది. వారి వయసుకు తగిన ఆటలు, పాటలు వంటి రిక్రియేషన్‌ గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఎంతసేపూ ఇంజినీరింగ్‌, డాక్టర్‌ టార్గెట్లు తప్ప వేరేవాటికి పిల్లల మెదళ్లలో చో టు లేదు. ఆవిధంగా నూరిపోస్తున్నారు మరి! ఆరేడు దశాబ్దాల క్రితం అన్ని సబ్జెక్టుల్లో 40% మార్కులు సాధించిన విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో తనకు తెలిసినంతవరకు స్పష్టమైన జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు. ఇక 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యత వుండేది. ఇంటర్‌ స్కూల్‌, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కోకో వంటి పోటీలు నిర్వహించేవారు. కానీ నేడు ఇవన్నీ కనుమరుగైపోయాయి. 95% మార్కులు సాధించిన విద్యార్థి నాటి 40% విద్యార్థి జ్ఞానంతో సమానస్థాయి కలిగివుండటంలేదు. ఈవిధంగా విద్యార్థులను గదుల్లో బంధించి స్పెషల్‌ క్లా సులు, చదువు తప్ప మరే ఇతర వ్యాపకం లేకుండా చేస్తుండటంతో వారిలో జీవనశైలి, క్రీడలు, కళలు వంటి రంగాల్లో నైపుణ్యం దాదాపు సున్నాగా వుంటోంది. ఇది చాలా ప్రమాదకరం. 144 కోట్లమంది ప్రజల్లో క్రీడల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం ప్రదర్శించేవారు లేకపోవడానికి ప్రస్తుత విద్యావ్యవస్థే కారణం. సదుపాయాలు తక్కువ వున్నా ప్రైవేటు విద్యకే తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం, ప్రభుత్వ విద్యావ్యవస్థ దారుణ వైఫల్యం. ఫలితంగా విద్యకోసం కొన్ని వందలు, వేలకోట్లు ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నా అది బూడిదలో పోసిన పన్నీరు చందంగా వుంటోంది తప్ప ఫలితం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేనివే అధికం. ఫర్నీచర్‌, తదితర సదుపాయాలు అందుబాటులో వుండవు. దీనికి తోడు చాలామంది టీచర్లు ఎంతసేపూ యూనియన్‌ కార్యకలాపాలు, తమ సొంత వ్యాపకాలు చూసుకోవడంలోనే తల మునకలుగా వుండటం తప్ప, విద్యపై దృష్టిపెట్టడంలేదు. అదీకాకుండా టీచర్లను ప్రభుత్వం వివిధ కా ర్యకలాపాలకు వినియోగించుకోవడం కూడా మరో కారణం. పాఠశాల విద్యలో ప్రధాన లోపం డిటైన్‌ సిస్టమ్‌ లేకపోవడం. దీనివల్ల స్థాయికి తగిన విద్యానైపుణ్యాలు సాధించకుండానే విద్యార్థులు పదోతరగతి వరకు చేరుకుంటున్నారు. ఆ స్థితిలో వీరిని ర్యాంకులకోసం రాచిరంపాన పెట్టి నా ఫలితం వుండదు. డ్రాపౌట్లు పెరగడం తప్ప! ఏదీ సులభంగా రాదు, కష్టపడి సాధించాలన్న సత్యాన్ని పిల్లలకు చిన్నతనంలోనే మనసులో నాటడం వల్ల, ఆ స్థాయినుంచే వారు కష్టపడటం నేర్చుకుంటారు. క్రీడల్లో ఉత్సాహం చూపేవారిని ఆ రంగంలో తగిన శిక్షణ ఇస్తే వారు రాణింపుకు వస్తారు. అందరూ ఒకే రంగంలో రాణించడం సాధ్యంకాదు. నేటి విద్య కేవలం ఇంజినీర్లు, డాక్టర్లను తప్ప మరెవరికీ ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఆవిధంగా నిర్లక్ష్యానికి గురైంది క్రీడా రంగం. దీనిపై ప్రభుత్వం సత్వరం దృష్టి పెట్టాలి. అసలు ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోతుండటానికి కారణమేంటని అర్థం చేసుకోవడానికి ఈ క్రింది గణాంకాల పరిశీలన అవసరం. 

విద్యార్థుల కొరత

2011 జనగణన ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 66.46%. జాతీయ సగటు 74% శాతం తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలోని 1213 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేదు. ఈ స్కూళ్లలో దాదాపు 1300 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఏకోపాధ్యాయ స్కూళ్లు, ఇద్దరు టీచర్లు పనిచేసే పాఠశాలలు కూడా వున్నాయి. ప్రవేశాలు లేకపోవడంతో ఈ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులను సమీప పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపాల్సి వచ్చింది. అంతేకాదు మొత్తం 30,023 ప్రభుత్వ స్కూళ్లలో 13,364 పాఠశాలల్లో 50% కంటే తక్కువే ప్రవేశాలు జరగడం ప్రభుత్వ విద్య దయనీయ స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో 5821 స్కూళ్లలో సింగిల్‌ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వ అధికా ర్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు 2024`25కు సమర్పించిన నివేదికలో వెల్లడిరచారు. అంతేకాదు రాష్ట్రంలో 9.44% బాలుర టాయిలెట్లు, 5.86% బాలికల టాయ్‌లెట్లు, 15.45 సీడబ్ల్యుఎస్‌ఎన్‌ టాయ్‌లెట్ల నిర్మాణం పెండిరగ్‌లో వున్నాయి. 18.19% పాఠశాలలకు సమగ్ర ప్రయోగశాలల సదుపాయం లేదు. 11.7% స్కూళ్ల ఐ.సి.టి. ల్యాబ్‌లు లేవు, 71% స్కూళ్లకు స్కిల్‌ఎడ్యుకేషన్‌ ల్యాబ్‌లు లేకుండానే పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024`25 విద్యాసంవత్సరానికి సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద రూ.1907 కోట్లను ఖర్చు చేసేందుకు ఆమోదం తెలుపగా, ఇందులో కేంద్రం వాటా రూ.1148 కోట్లు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వుంటుంది.

మౌలిక సదుపాయాల లేమి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఘోరమైన నిర్లక్ష్యానికి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (యుడిస్‌) తన నివేదికలో వెల్లడిరచింది. రాష్ట్రంలోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో 25,217 స్కూళ్లకు తాగునీటి సదుపాయం, 15,986 స్కూళ్లలో బాలికల టాయ్‌లెట్లు, 8,888 స్కూళ్లలో తగినంత ఫర్నీంచర్‌ వున్నదని నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 5వేల పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. అదేవిధంగా 22వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్‌ సౌకర్యం లేదు. 26,095 స్కూళ్లకు విద్యుత్‌ సదుపాయం వుండగా, 20,574 పాఠశాలలు (అంటే రెండిరట మూడువంతులు) క్రీడా మైదానాలను కలిగివున్నాయి. మొత్తం 30,014 స్కూళ్లలో 8,284 స్కూళ్లకు కంప్యూటర్‌ సదుపాయం వుండగా, 2,760 పాఠశాలలకు మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. ఇక వైద్య పరీక్షల విషయానికి వ స్తే కేవలం 9,726 స్కూళ్లు మాత్రమే విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించాయి. నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే`2021(ఎన్‌ఎస్‌ఎ`2) ప్రకారం జాతీయ స్థాయిలో పాఠశాలల సగటు పనితీరుతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి వుండటం గమనార్హం. ఈవిషయంలో జాతీయ సగటు 37.8% కాగా, రాష్ట్ర సగటు 36.7% నమోదైంది. 

గణితం, సైన్స్‌ల్లో పూర్‌

తెలంగాణ విద్యార్థులు లాంగ్వేజెస్‌లో 100 మార్కులకు సగటున 48 మార్కులు స్కోర్‌ చేయగా,గణితంలో (32), సైన్స్‌లో (35) సాంఘికశాస్త్రంలో (34) సాధించడం ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎంత అధ్వాన్నంగా వున్నదీ వెల్లడిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, పనితీరు అధ్వాన్నంగా వున్న నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా తల్లిదండ్రులు త మ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికే మొగ్గు చూపుతుండటం గమనార్హం. విచిత్రమే మంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే, ప్రైవేటు పాఠశాలల సంఖ్య తక్కువైనప్పటికీ వీటిల్లో చేర్పించడానికే ప్రాధాన్యతనిచ్చేవారు 51.3% వుండటం ప్రభుత్వ పాఠశాలలు తమన పనితీరును ఎంతగానో మెరుగుపరచుకోవాలన్న సత్యాన్ని వెల్లడిస్తోంది.

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న ప్రవేశాలు

2021ా22 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 43,083 పాఠశాలలుండగా వీటిల్లో 59,60,913 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిల్లోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 29,73,684 కాగా, కేవలం 13,069 ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు 29,87,229. విచిత్రమేమంటే ప్రభుత్వ పాఠశాలల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య సగంకూడా లేకపోయినప్పటికీ వీటిల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం ప్రభుత్వ స్కూళ్ల కంటే ఎక్కువ! 2022ా23 ఆర్థిక సంవత్సరంలో ‘యుడిస్‌’ ఇచ్చిన నివేదిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందన్న సంగతిని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 30,307 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 28,95,456 కాగా, 10,634 ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30,49,766. ఈవిధంగా ప్రైవేటు పాఠశాలలపట్ల పట్టణ ప్రాంతాల తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపడం కనిపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే మేడ్చెల్‌ామల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికశాతం తల్లి దండ్రులు ప్రైవేటు స్కూళ్లకు ప్రాధాన్యనిచ్చారు. ఈ జిల్లాలో 1478 ప్రైవేటు పాఠశాలలు, 558 ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తుండగా 81.6% విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు.హైదరాబాద్‌ నగరంలో మొత్తం 2,867 స్కూళ్లుండగా 7,85,054 మంది విద్యార్థులు వీటిల్లో చదువుకుంటున్నారు. మళ్లీ ఇక్కడ కూడా 71.1% ప్రవేశాలతో ప్రైవేటు పాఠశాలలదే ఆధిపత్యంకొనసాగుతోంది. నగరంలోని మొత్తం 1863 ప్రైవేటు పాఠశాలల్లో 6,05,190 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, అదే 1004 ప్రభుత్వ స్కూళ్లలో 1,79,864 మంది పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు.

జయశంకర్‌ాభూపాలపల్లి జిల్లాలో మెరుగు

జయశంకర్‌ాభూపాలపల్లి జిల్లాల్లో మాత్రం పై గణాంకాలకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్కూళ్ల సంఖ్య చాలా తక్కువ. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడదు. భూపాలపల్లిలో మొత్తం 337 పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 33.1% మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. అదేవిధంగా ములుగులో 553 స్కూళ్లుం డగా కేవలం 20.8% విద్యార్థులు మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. 

నలిగిపోతున్న విద్యార్థులు

విషయమేంటంటే ప్రవేశాలే కుంచించుకు పోతున్నప్పుడు, క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేది ఎక్కడ? ప్రవేశాలు దండిగా వున్న ప్రైవేటు స్కూళ్లకు క్రీడలు పట్టవు. వాటికి ర్యాంకులు ముఖ్యం. ర్యాంకులు వస్తేనే వాటికి మనుగడ! విద్యా వ్యాపారంలో లాభానికి మొదటి మెట్టు ‘ర్యాంకు’. అంతేకాని క్రీడలు, కళలు ఇతర కార్యకలాపాలు కావు. ఫలితంగా విద్యార్థులు యాత్రికంగా తయారవుతు న్నారు. వీరి మెదళ్లలో ర్యాంకులు తప్ప మరే ఇతర అంశాలకు స్థానం లేదు. ప్రైవేటు పాఠశాల ల పోటీకి తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలలు కూడా ర్యాంకుల బాటనే పడుతున్నాయి. కానీ ఈ ర్యాంకుల ‘పిచ్చి’కి ఒక దిశ, దశ వుండటంలేదు. విద్యార్థి మానసిక సామర్థ్యం, అతనిలోని నైపు ణ్యాలు, ఆసక్తుల గురించి పట్టించుకునే నాధుడే లేదు. ఒక్కటే లక్ష్యం! ఇంజినీర్‌ లేదా డాక్టర్‌!! మరి దీనికి అంతం ఎక్కడ? పరిష్కారం లభించేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!