గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి మన గ్రోమోర్ సెంటర్ జెడ్పిహెచ్ ఎస్ స్కూల్ ఎదురుగా ప్రారంభత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏడిఏ తాతారావు, ఏఓ వెంకటరమణ, కొరోమాండల్ కంపెనీ ప్రతినిధులు ఏజిఏం శ్రీనివాసు రెడ్డి,ఏరియా మేనేజర్ క్రిష్ణయ్య, తదితర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతా రావు మాట్లడుతు మన గ్రోమోర్ సేవల గురించి రైతులకు ఖరీఫ్ గురించి చూచనలు తెలిపారు.కొరోమాండల్ కంపెనీ ఏజిఏం శ్రీనివాస్ రెడ్డి మన గ్రోమోర్ సెంటరీలో సరసమైన ధరలకు నాక్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, తదితర ధరలకు లభించునని కంప్యూటర్ బిల్ ద్వారా అమ్మకం జరుగుతుంది అని తెలియచేశారు. అంతే కాకుండా మన గ్రామార్ సెంటర్ వారు భూ సారా విశేషాలు వ్యవసాయ సలహలు మరియు సేవలు గురించి సవివరంగా రైతులకు తేలియచేయడం జరుగుతుందన్నారు.
మన గ్రోమార్ సెంటర్ ప్రారంభోత్సవం
