పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సిఎస్ఐ సంస్థను స్థాపించి వంద సంవత్సరాలకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం రోజున సంవత్సరాల వేడుకలు ప్రార్ధన లతో ఘనంగా నిర్వహించడం జరిగింది.నూతనంగా నిర్మించిన స్థానిక సిఎస్ఐ సెంట్ పౌల్స్ చర్చిని కరీంనగర్ అధ్యక్ష మండలం రెవరెండ్ బిషప్ రూబెన్ మార్క్ ప్రారంభించడం జరిగింది.అనంతరం పాస్టర్లు సంగస్థుల సమక్షంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల చర్చి పాస్టర్లు,సంఘ కాపారులు,ఇవంజలిస్టులు,సంఘ పెద్దలు,సంఘస్థులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సీఎస్ఐ నూతన చర్చ్ ప్రారంభోత్సవం
