నిజాంపేటలో…
దొంగల బీభత్సం
నిజాంపేట: నేటి ధాత్రి
శుక్రవారం అర్ధరాత్రి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని పెద్దమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి అందులోనీ డబ్బులు దొంగిలించినట్టు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. అలాగే వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లోనీ ఆలయాలలో చోరీకి ప్రయత్నం జరిగిందని కానీ ఏలాంటి నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.