పలు గ్రామాల్లో సిసి రోడ్లకు భూమి పూజ చేసిన

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం శుక్రవారం బోయినపల్లి మండలంలోని తడగొండ , బోయినపల్లి , బూరుగుపల్లి , కోరెం, గుండన్నపల్లి , స్తంభంపల్లి గ్రామంలో ఈజీఎస్ సీసీ రోడ్ల భూమి పూజక చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ సర్కార్లో ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలన కార్యక్రమం మొదలుపెట్టారని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మేలు చేకూరుతుందని ముఖ్యంగా మోడల్ స్కూల్ లోని సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారని ప్రతి ఒక్క సమస్యను తీరుస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *