High Court Orders House Sites for Activists
ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా?
నిందితులను కఠినంగా శిక్షించాలి
బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్.
బాలానగర్ నేటి దాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కులం పేరుతో దాడి చేసి, పసిపాప ప్రాణం పోవడానికి కారణమైన వారిని కాపాడటం సిగ్గుచేటు
ఢిల్లీలో రాహుల్ గాంధీ, సామాజిక న్యాయం’ అని క్లాసులు చెప్తారు. కానీ.. తెలంగాణలో ఆయన పార్టీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. గుడికి వెళ్తే దాడులా? ఇదేనా మీ ప్రజా పాలన.. రేవంత్ రెడ్డి నిందితులను వదిలేస్తారు… ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేస్తారు! నాగర్ కర్నూల్ ఘటనపై గళం ఎత్తినందుకు నాయకులపై ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు. పాప మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
