Collector Inspects Paddy Procurement in Jillella
జిల్లెల్ల గ్రామంలో ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలన రైతులకు టార్పిలిన్లు కచ్చితంగా అందజేయాలి ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్. గరీమ అగ్రవాల్. జిల్లెల్ల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.పాక్స్ కొనుగోలు కేంద్రంలోనీ. ధాన్యం కుప్పలు. వడ్లు తేమశాతం పరిశీలించి. వర్షాలు అనేసథ్యంలో రైతులు వరి కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచిస్తూ. రైతులకు తార్పలిన్లు కచ్చితంగా అందజేయాలని. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దాన్యాన్ని రైస్ మిల్లర్ అన్లోడ్ చేసుకునేలా చూడాలని. సన్న రకం వడ్లను కూడా తీసుకునేలా అన్ని చర్యలు. తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు. ఎటువంటి ఆందోళన చెందవద్దని. ప్రభుత్వపరంగా అన్ని విధాల. రైతులకు అండగా ఉంటూ. సహాయ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాష్. తంగళ్ళపల్లి తహసిల్దార్ జయంత్. పాక్స్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
