ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ మేయర్ల పాత్ర ఏంటి?
అధికారిక కార్యక్రమాల్లో వేదికపై మాజీలను పిలిచినమున్సిపల్ కమిషనర్ పైచర్యలు తీసుకోవాలి
బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్
_సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బిజెపి పార్టీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు,
డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్ పైచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బిజెపికి చెందిన నాయకులు వేదిక పై కూర్చున్న కమిషనర్ మౌనంగా ఉండటం ఉండి ప్రజలను అవమానపరుస్తున్నారని బిజెపి కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో అరవై మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి,రాజు ఈసందర్భంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.