గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు

గ్రూప్ – II పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు.

పరీక్ష కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్. డి ఎన్ ఎస్ ఎస్ -2023 సెక్షన్ అమలు

జిల్లాలోని 38 పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్న 13,465 మంది అభ్యర్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

డిసెంబర్ 15,16 తేదీలలో టి జి టి ఎస్ సి ఆధ్వర్యంలో జరగనున్న గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163. బి ఎన్ ఎస్ ఎస్. యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.డిసెంబర్ 15 మరియు 16 తారీఖులలో జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే గ్రూప్-II పరీక్షల సందర్భంగా డిసెంబర్ 15 ఉదయం 6:00 గంటల నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 6:00 వరకు అంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,465 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని,కొత్తగూడెంలో 25 పరీక్షా కేంద్రాలు, పాల్వంచలో 13 పరీక్షా కేంద్రాలలో జరగనున్న ఈ పరీక్షల కోసం మొత్తం 300 మంది అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో గుంపులుగా వుండరాదని,ఎలాంటి సభలు,సమావేశాలు,ర్యాలీలకు, మైకులు,డిజేలతో ఉరేగింపులు,ధర్నాలు,ప్రచారాలకు అనుమతి లేదని పేర్కొన్నారు.పరీక్షా సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్,జిరాక్స్ షాపులు,స్టేషనరీ దుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు,రాజకీయ పార్టీలు,వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.అదే విధంగా పరీక్షా సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!