భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం.
కల్వకుర్తి / నేటి దాత్రి:
కల్వకుర్తి నియోజకవర్గం లోని గుండూర్ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయము భక్తి శ్రద్ధలతో గణపతి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నము అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రము గణేష్ నిమజ్జనంలో మొదటి లడ్డు వేలంలో రూ 2,50,116 ఆజాద్ యువజన సంఘం తీసుకోవడం జరిగింది. రెండవ లడ్డు రూ 30,000 భుజాల పర్వత్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, పర్వత్ రెడ్డి, నర్మదా, గ్రామ పెద్దలు, హనుమాన్ గణేష భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.