సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణంలో అక్రమంగా నిర్మిస్తున్న డబ్బాలు (దుకాణాలు) తొలగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు,ఆర్ధికంగా వున్నా వాళ్ళు కుడా అక్రమంగా డబ్బాలు వేసుకున్నారు అని అన్నారు.సంబందిత అధికారులు వెంటనే వాటిని తొలగించాలని కోరారు.కొన్ని సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేసుకుంటా రోడ్ వెడల్పు లో భాగంగా దుకాణాలు కోల్పోయిన వారు వున్నారని వారికీ ఎవరికీ న్యాయం చేయలేదు అని అన్నారు. అక్రమంగా డబ్బులు వేసి కిరాయికి ఇచ్చుకుంటు సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం,అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. లేనియెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ప్రవీణ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,అరబోయిన వెంకటేష్,కాంతారావు,రాసపల్లి భద్రయ్య, మహేష్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.