— కన్నెత్తి చూడని అధికారులు,
— ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు,
నిజాంపేట: నేటి ధాత్రి
అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది అధికారులు అండను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే నిజాంపేట మండలం కల్వకుంట, దుబ్బాక మండలం తాళ్లపల్లి గ్రామాలను ఆనుకుని ఇసుక ఉంది అక్రమ సంపదనే ధ్యేయంగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పేరును వాడుకుంటూ కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో జెసిబిల సహాయంతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు.
స్థానికంగా దొరికే ఇసుకను ఏలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు చేసి యదేచ్చగా సందర్భాన్ని బట్టి ఇసుక తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా పై స్థానిక తహసిల్దార్ సురేష్ కుమార్ వివరణ అడగగా ఇసుక రవాణాకు ఇలాంటి అనుమతులు లేవని, అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసిన, ఇసుక నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకొని ఇసుక డంపును సీజ్ చేస్తామని హెచ్చరించారు.