నర్సంపేటలో అక్రమ కట్టడాలను తొలగించాలి

#మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
#టిపీసీసీ సభ్యులు పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలో నలాలను అక్రమించి అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని 18 డివిజన్ లో అక్రమంగా కట్టడాలను మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించి పలు అభివృద్ధి పనులకు అడ్డంకాలు లేకుండా సహకారం చేయాలని రామానంద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో కలిసి 18 డివిజన్ లో పలు పర్యటన చేశారు. ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోనే నర్సంపేట పట్టణా అభివృద్ధి సాధ్యమని పలు అభివృద్ధి పనులను నడుస్తున్న క్రమంలో అక్రమంగా కట్టిన ఇండ్లతో ఇబ్బంది జరుగుతుందని చెప్పారు.వాటిని త్వరగా తొలగించి అభివృద్ధి పనులకు సహకారం అందించాలని కోరారు.పట్టణంలోని సీసీ రోడ్డు సైడ్ డ్రైనేజీలు పనులు నడుస్తున్న సందర్భంలో అక్రమ కట్టడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని వాటిని ప్రజలు గమనించి వార్డులో పలు అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 18 వ డివిజన్ కౌన్సిలర్ బత్తిని రాజేందర్,మున్సిపల్ ఏఈ, మున్సిపల్ సిబ్బంది వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!