పేద ప్రజల వద్ద నుండి అక్రమ వసూలు
జైపూర్ నేటి ధాత్రి:
మండలంలోని ముదిగుంట గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా అందే పథకాలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినికిడి. గ్రామంలోని తోటి కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.ఎవరైతే పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో వారిని గుర్తించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.