బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామ్యకo

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
కె. వి.రంగా కిరణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేస్తున్న దీక్ష భగ్నం చేసి అక్రమ అరెస్టు ను నిరసిస్తూ కొత్తగూడెం పట్టణంలో బస్టాండ్ అమరవీరుల స్థూపం వద్ద భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నిరసనలో భాగంగా కె.వి.రంగా కిరణ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి కోసం 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేసి మహిళలు అని కూడా చూడకుండా వారిని లాకెళ్లడం బాధాకరం అని తెలిపారు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తానని కేసీఆర్ మోసం చేశాడు అంతేకాకుండా రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లీ శ్రీనివాస్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాసరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ అగర్వాల్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, జంటంగి కృష్ణ, పాల్వంచ పట్టణం ప్రధాన కార్యదర్శి రాపాక రమేష్ జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!