అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..

Mandamarri

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

 

మందమర్రి నేటి ధాత్రి

 

బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

 

బి ఆర్ ఎస్ వి మందమర్రి పట్టణ అధ్యక్షులు MD.ముస్తఫా ..

కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.

అసెంబ్లీ ముట్టడి నిరసన గా ఈ రోజు ఉదయం 6 గంటలకు బి అర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు MD ,ముస్తఫా తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నవీన్ మరియు md,తాజ్ గారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం…

విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు కనబడుతుంది అని అన్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అని తెలిపారు.
హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని కోరారు.

ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపు లో సున్నా అని కోరారు.ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు..

ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుందన్నారు.

3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసని తెలిపారు.

18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!