పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో.!

Business Business

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి

నేటి యువత అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నారు అది తెలంగాణ మట్టిగడ్డ యొక్క గొప్పతనం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని శాంతినగర్ లో శ్రీసేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్ నందు మాలోత్ కల్పన రాజు నాయక్ పెట్టిన రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ కొత్తపెల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ లతో కలసి ప్రారంభించడం జరిగినది. ఈసందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నేటి యువతరం కష్టపడి తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో రకమైన వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని ఒకప్పుడు ఏపని లేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు ఎదుగుతుంది అంటే అందుకు కారణం యువతరమని ఏదో ఒక పని చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని అందుకోసమే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఉద్యోగం కాదు వ్యాపారంలో కూడా అధిక లాభాలు సంపాదించి అభివృద్ధి చెందవచ్చనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించారన్నారు. అందులో భాగమే నేడు కల్పన రాజు నాయక్ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడడం కోసం బేకరీ ఫాస్ట్ ఫుడ్ పెట్టడం జరిగిందని సందర్భంగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ నజీమా బేగం, బిజెపి నాయకులు సదానందం నాయక్,
బిఆర్ఎస్ నాయకులు చెట్టుపెళ్లి నరేందర్, మల్లేశం, భాస్కర్ నాయక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రవి నాయక్, గిరిజన నాయకులు రంగనాయక్, మోహన్ నాయక్, పాప నాయక్, జాంగిర్, పైడిపాల రవి, శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!