Sujatha Pushes Strong Sarpanch Campaign
ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.
#కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నల్లబెల్లి గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సైడ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా కష్టపడి పనిచేస్తానని. అదేవిధంగా గ్రామంలో గత పాలకుల సమయంలో చేయని పనులు ఎన్నో తిష్ట వేశారని వాటిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామంలో నెలకొన్న సిసి రోడ్, డ్రైనేజీ, సెంటర్ లైటింగ్ పనులు, అర్హులైన వారికి పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్ మహాశయులను ఆమె అభ్యర్థించారు.
