Strict Action Against Chinese Manja Sales in Zaheerabad
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే….. వారికి కఠిన చర్యలు తప్పవు….!
• చైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు : ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం
ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ తెలియజేశారు. చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ఆదేశాల మేరకు మండల చైనా మాంజా నిల్వలపై దాడులు నిర్వహించి, నిషేధిత చైనా మాంజాను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండేలా ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రాణ భద్రతకు సహకరించాలని సూచించారు.
మండల ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగించినట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే…..!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే..అరెస్ట్ చేస్తామని! ఈ చైనా మాంజాపై జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ కోహిర్ మండలాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైనా మాంజా అమ్మే దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఎవరైనా చైనా మాంజాను అమ్మినట్లయితే కేసులతో పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

చైనా మాంజాపై నిషేధం ఉన్న విచ్చలవిడిగా జరుగుతున్న అమ్మకాలను ఎండగట్టింది. చైనా మాంజా ఏడు మంది ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం తెచ్చిందో సవివరంగా చూపించింది. దాని ఫలితంగా అధికారులు కదిలారు.
పతంగులకు, మాంజాల హోల్సేల్ విక్రయాలకు కేరాఫ్గా ఉన్న మండల దుకాణాల యజమానులను హెచ్చరించారు, గాజుపూత, కెమికల్స్ ఉండే చైనా మాంజా అమ్మవద్దని నిబంధనలు ఉన్నా ఎందుకు విక్రయిస్తున్నారంటూ కేసులు పెట్టారు. పతంగులు కాగితంతోనే చేస్తారు కావచ్చు. కానీ దాన్ని ఎగరేసే దారం విషయంలో మాత్రం చాలామంది చైనామాంజాను వాడుతున్నారు.
దానికి ఉన్న గాజుపూత, కెమికల్ పూతలతో అవి షార్ప్గా మారతాయి. ఎంత షార్ప్ అంటే.. వేగంగా బైక్పై వెళ్తున్న వ్యక్తి మెడకు ఆ మాంజా తగిలిందీ అంటే.. అంతే సంగతులు. పీక తెగుతుంది. ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇలాంటివి మూడు నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇక పతంగుల సీజన్లో అయితే వందలాది పక్షులు ఈ మాంజాకు బలవుతున్నాయి. అందుకే చైనా మాంజాపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధం విధించాయి.
ఈ సందర్భంగా ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పాటేల్ మాట్లాడుతూ.. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని వ్యాపారస్తులను హెచ్చరించారు. కైట్స్ షాప్ నిర్వాహకులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోని పక్షంలో జైలుపాలు అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని సూచించారు. ఇందుకు ప్రజలు కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజలే దీన్ని ఒక బాధ్యతగా వహించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
అంతేకాకుండా, ఇంట్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దాంతో పాటు చైనా మాంజా విక్రయాలను అరికట్టేలా చర్యలపై ఎస్ఐ క్రాంతి కుమార్ పాటేల్ వివరించారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
